హౌతీలపై అమెరికా, బ్రిటన్లు దాడులు.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు
- January 12, 2024
రియాద్: ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న సైనిక కార్యకలాపాలు, యెమెన్ రిపబ్లిక్లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అమెరికా, యూకే లు యెమెన్ లోని హౌతీలపై భారీ దాడులు ప్రారంభించాయి. దాడులపై సౌదీ అరేబియా స్పందించింది. సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతం స్థిరత్వం, భద్రతను కాపాడుకోవడానికి శాంతియుత తీర్మానం అవసరం ఉందని తెలిపింది. యూఎస్, బ్రిటీష్ మిలిటరీలు గురువారం యెమెన్లో ఇరాన్-మద్దతుగల హౌతీలకు చెందిన జనుకు పైగా సైట్లపై బాంబు దాడులు చేశాయి. అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఎర్ర సముద్రం మీద మిలిటెంట్ గ్రూప్ యొక్క నిరంతర దాడులను సహించవని, అందుకే ఈ దాడులు చేసినట్లు అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. మరోవైపు తైఫ్లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్లో విదేశీ బలగాలు ఉన్నాయనే పుకార్లను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ పుకార్లు అబద్ధమని మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ టర్కీ అల్-మాలికీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







