హౌతీలపై అమెరికా, బ్రిటన్లు దాడులు.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు
- January 12, 2024
రియాద్: ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న సైనిక కార్యకలాపాలు, యెమెన్ రిపబ్లిక్లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అమెరికా, యూకే లు యెమెన్ లోని హౌతీలపై భారీ దాడులు ప్రారంభించాయి. దాడులపై సౌదీ అరేబియా స్పందించింది. సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతం స్థిరత్వం, భద్రతను కాపాడుకోవడానికి శాంతియుత తీర్మానం అవసరం ఉందని తెలిపింది. యూఎస్, బ్రిటీష్ మిలిటరీలు గురువారం యెమెన్లో ఇరాన్-మద్దతుగల హౌతీలకు చెందిన జనుకు పైగా సైట్లపై బాంబు దాడులు చేశాయి. అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఎర్ర సముద్రం మీద మిలిటెంట్ గ్రూప్ యొక్క నిరంతర దాడులను సహించవని, అందుకే ఈ దాడులు చేసినట్లు అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. మరోవైపు తైఫ్లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్లో విదేశీ బలగాలు ఉన్నాయనే పుకార్లను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ పుకార్లు అబద్ధమని మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ టర్కీ అల్-మాలికీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







