కార్మికులకు శాపంగా చీప్ ఫుడ్
- May 30, 2016
దుబాయ్లో కార్మికులు, తక్కువ ధరకే లభించే ఆహారం పట్ల ఆసక్తి చూపుతుండడం వారి ఆరోగ్యానికి తీవ్ర హానికరంగా మారుతోందని దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు చెప్పాయి. తాజా తనిఖీల్లో 35 టన్నుల 'తినడానికి పనికిరాని ఆహారాన్ని' మునిసిపాలిటీ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ పోలీస్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ సహకారంతో దుబాయ్ మునిసిపాలిటీ ఈ తనిఖీల్ని నిర్వహించింది. కార్మికులు శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడంలో వారి ఆర్థిక స్థితిగతులు సహకరించడంలేదనీ, వారి ఇబ్బందుల్ని క్యాష్ చేసుకోడానికి కొందరు వారికి దగ్గరగానే తక్కువ ధరలో ఆహార విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమనీ, ప్రజారోగ్యానికి హానికరమని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మార్వాన్ అల్ మొహమ్మద్ చెప్పారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ పలు సందర్భాల్లో నిర్వహించినట్లు వివరించాచారయన. 2016 ప్రారంభం నుంచి దుబాయ్ మునిసిపాలిటీ 23 తనిఖీల్ని నిర్వహించి, ఇల్లీగల్ మార్కెట్ని అడ్డుకుంటోంది. పాడైపోయిన మాంసం, ఫిష్ మరియు కూరగాయలు ఈ తక్కువ ధర ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







