శ్రీలంకకి రెడ్ క్రిసెంట్ సాయం
- May 30, 2016
ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్సి), వరదలతో సతమతమైన శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. శ్రీలంకలో వరద బాధితులకు తక్షణ అవసరమైన ఆహారం, షెల్టర్ మెటీరియల్ వంటివాటిని అందించనుంది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టారు. కొలంబోలోని యూఏఈ ఎంబసీతో కలిసి ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ సహాయక చర్యలు చేపట్టింది. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ ప్రతినిథులు, అవసరమైన మేర శ్రీలంక వరద బాధితుల్ని ఆదుకుంటున్నారు. ఆహారం, మందులు, షెల్టర్స్ వంటివాటి ద్వారా బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఇఆర్సికి అభినందనలు తెలియజేస్తున్నారు శ్రీలంక ప్రతినిథులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







