శ్రీలంకకి రెడ్‌ క్రిసెంట్‌ సాయం

- May 30, 2016 , by Maagulf
శ్రీలంకకి రెడ్‌ క్రిసెంట్‌ సాయం

ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ (ఇఆర్‌సి), వరదలతో సతమతమైన శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. శ్రీలంకలో వరద బాధితులకు తక్షణ అవసరమైన ఆహారం, షెల్టర్‌ మెటీరియల్‌ వంటివాటిని అందించనుంది. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచన మేరకు, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ మరియు డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టారు. కొలంబోలోని యూఏఈ ఎంబసీతో కలిసి ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ సహాయక చర్యలు చేపట్టింది. ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ ప్రతినిథులు, అవసరమైన మేర శ్రీలంక వరద బాధితుల్ని ఆదుకుంటున్నారు. ఆహారం, మందులు, షెల్టర్స్‌ వంటివాటి ద్వారా బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఇఆర్‌సికి అభినందనలు తెలియజేస్తున్నారు శ్రీలంక ప్రతినిథులు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com