అరటి పండులోని పోషకాల గురించి తెలిస్తే.!
- January 16, 2024ఆప్ట్రాల్ అరటిపండు.. అనుకుంటాం. ఎందుకంటే పండ్లలో అతి తేలికగా లభించే పండు అరటి పండు. చాలా మంది అరటి పండును లైట్ తీసుకుంటారు. కానీ, అరటి పండులో ఎన్నో పోషకాలున్నాయ్. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఎన్నెన్నో.!
అవేంటో తెలుసుకుందామా.? అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే మలబద్దకం వున్నవారికి ఇదో వరంగానే చెప్పొచ్చు. అరటిపండులోని సింథటిక్ లాక్సిటివ్గా పని చేస్తుంది. సో, క్రమం తప్పకుండా అరటి పండు తింటే, మలబద్ధకం అనే సమస్య దరి చేరదు.
అలాగే అజీర్తి సమస్య వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు, అరటి పండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయ్. శరీరం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి చాలా అవసరం.
అయితే, అరటి పండులో కాలరీలు ఎక్కువగా వుంటాయ్. ఊబకాయం వున్నవాళ్లు కాస్త ఆచి తూచి తినాల్సి వుంటుంది. కేలరీలు అధికంగా వుండడం వల్లనే.. ఎక్కువ ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క అరటి పండు తింటే.. కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది.
అరటి పండులో కార్భోహైడ్రేట్లు కూడా పుష్కలంగా వుండడంతో పాటూ, అంతకు రెండు రెట్లు విటమిన్ ఎ అధికంగా వుంటుంది. రక్తపోటు అదుపులో వుంచేందుకు అరటి పండు ఓ దివ్యౌషధమే అని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక