స్థానిక సంస్థల వృద్ధికి జాతీయ ఉత్పత్తి విధానం: ఒమన్
- January 17, 2024
మస్కట్: జాతీయ ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రోత్సహించడం, స్థానిక కంపెనీల వృద్ధికి దోహదపడేందుకు నేషనల్ ప్రొడక్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ ను ఒమన్ తీసుకొచ్చింది. పౌరులు, నివాసితులు వారి రోజువారీ వినియోగం కోసం స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడానికి అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన గణాంకాలు 2023 మూడో త్రైమాసికం చివరి నాటికి ప్రస్తుత ధర ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో తయారీ పరిశ్రమల సహకారం 8 శాతంగా ఉందని తెలిపింది. ఒమానీ ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణిక స్పెసిఫికేషన్లతో సహా అనేక కారణాల వల్ల పౌరులు మరియు నివాసితులు జాతీయ ఉత్పత్తులను ఆదరిస్తున్నారని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) వెల్లడించింది. స్థానిక ఉత్పత్తుల కొనుగోలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిస్తుందని, భవిష్యత్తులో వాటి వినియోగాన్ని పెంచుతుందని మంత్రిత్వ శాఖ సూచించింది. జాతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం క్క ప్రాముఖ్యతపై సమాజంలో అవగాహన పెంచడానికి ‘మేడ్ ఇన్ ఒమన్ క్యాంపెయిన్’ దోహదపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ ప్రోడక్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందని, మేడ్ ఇన్ ఒమన్ ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, ఒమానీ కంపెనీలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను కూడా అందిస్తోందన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







