ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు
- January 22, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న కువైట్లోని అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో కాన్సులర్ క్యాంప్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. ఇందులో ఎంబసీ పాస్పోర్ట్ రెన్యూవల్, ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్, పిసిసి అప్లికేషన్స్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ, లేబర్ ఫిర్యాదుల నమోదు మొదలైన సేవలను అందించనున్నారు. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంప్ సైట్లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









