యూఏఈలో మొదటిసారిగా.. అద్దెప్లాట్ల కోసం వేలం
- January 22, 2024
యూఏఈ: యూఏఈలో మొదటిసారిగా దుబాయ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ అద్దెదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేకమైన వేలం విధానాన్ని అవలంబిస్తోంది. అద్దెదారులు నివసించడానికి భవనాలను ఎంచుకునే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా చేపట్టిన ఈ విధానం రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్లో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆల్ఫాబెటా ప్రాపర్టీస్ తన నివాస ప్రాజెక్ట్ M77ను మైడాన్ అవెన్యూలో ప్రారంభించింది. 1, 2 మరియు 3 బెడ్రూమ్లతో కూడిన 77 అపార్ట్మెంట్లను కలిగి ఉన్న ఈ విలాసవంతమైన భవనం డౌన్టౌన్ మరియు బుర్జ్ ఖలీఫా వ్యూని అందిస్తుంది. అద్దెలు విస్తీర్ణాన్ని బట్టి Dh105,000 నుండి Dh150,000 -350,000 మధ్య ఉన్నాయి. ఆల్ఫాబెటా ప్రాపర్టీస్పై ఆన్లైన్ వేలం జనవరి 21న ప్రారంభమైందని డెవలపర్లు ప్రకటించారు. రెండు వారాల పాటు వేలం కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నమోదు చేసుకోవాలని, షార్ట్లిస్ట్ అనంతరం వ్యక్తిగతంగా ప్లాట్ లను సందర్శించే అవకాశం కల్పిస్తామని ఆల్ఫాబెటా ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు అల్ షైబానీ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









