ప్రధాన రహదారిపై అక్రమంగా డ్రిఫ్ట్. వెహికల్ సీజ్
- January 22, 2024
దోహా: ఖతార్లోని పబ్లిక్ రోడ్డులో నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేయడం పెరుగుతున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా అలా వదిలేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని, అతని వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత అతను సంఘటన స్థలం నుండి పారిపోయాడు. వాహనం మరియు డ్రైవర్ రెండింటినీ ట్రాక్ చేసి, పట్టుకుని, ఆపై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యపు డ్రైవర్పై వచ్చిన ఆరోపణల కారణంగా వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో స్వాధీనం చేసుకున్న వాహనం ష్రెడర్లో వేయాడాన్ని చూపించారు. ట్రాఫిక్ చట్టం రోడ్డుపై నిర్లక్ష్యంగా, జాగ్రత్త లేకుండా వాహనం నడపడం నిషేధించిందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అటువంటి ఉల్లంఘనలకు జరిమానాలో ఒక నెల కంటే తక్కువ కాకుండా.. మూడు సంవత్సరాలకు మించని జైలు శిక్షతోపాటు పది వేల రియాల్స్ కంటే తక్కువ, యాభై వేల రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా లేదా ఈ రెండు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చిరంచింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









