‘సలార్ 2’ కథ కోసం కసరత్తులు.!
- January 23, 2024
‘సలార్’ మొదటి పార్ట్కి ఫ్లాష్ బ్యాక్ కథే ప్రాణం. ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా వుందంటే.. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్టే. కథ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్కి అర్ధమయ్యేలా విప్పి చెప్పేశాడు ప్రశాంత్ నీల్.
రెండో పార్ట్లో కథ ఎలా వుండబోతుందన్న విషయాన్ని మొదటి పార్ట్ ఎండింగ్లోనే ఓ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ, ఆ కథనాన్ని ఆసక్తికరంగా ఎలా తెరపై ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్.? అనేదే ఇక్కడ ఆసక్తి గొలిపే అంశం.
అందుకే రెండో పార్ట్ కథపై ఇంకాస్త ఎక్కువ కసరత్తులు చేస్తున్నారట. ఓ స్పెషల్ టీమ్ ఈ స్క్రిప్ట్ వర్క్లో పని చేస్తోందట. శౌర్యంగ వంశానికి చెందిన దేవాకీ, వరద రాజ మన్నార్కి మధ్య రాజకీయ పోరు ఎలా వుండబోతుందో ‘సలార్ 2’లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
అలాగే, రాధా రమగా శ్రియా రెడ్డి పాత్రనీ, ఆమె భర్త బాబీ సింహా పాత్ర కూడా అత్యంత శక్తివంతంగా తీర్చి దిద్దబోతున్నారట. మొదటి పార్ట్లోని కొన్ని కొన్ని లోపాలను రెండో పార్ట్లో సవరించేందుకు ఎక్కువ టైమ్ తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా ‘సలార్’ మొదటి పార్ట్కి వచ్చిన కాస్తో కూస్తో హైప్తో రెండో పార్ట్పై అంచనాలకు మించకుండా హార్డ్ వర్క్ చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ భావిస్తోందట.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







