బంగారం దిగుమతి సుంకం భారీగా పెంపు..!

- January 23, 2024 , by Maagulf
బంగారం దిగుమతి సుంకం భారీగా పెంపు..!

న్యూ ఢిల్లీ:  బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.పెంచిన దిగుమతి సుంకం సోమవారం (2024 జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), ఐదు శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (AIDC)గా నిర్ణయించింది. సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండి ఆభరణాల్లో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ కిందకు వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com