విశ్వ హిందీ పరిషత్తు సమన్వయకర్తగా అచార్య యార్లగడ్డ
- January 23, 2024
విశాఖపట్నం: పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ది కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశ్వ హిందీ పరిషత్, అచార్య యార్లగడ్డను అమెరికా, కెనాడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు యార్లగడ్డ హిందీ నేర్చుకోవటంలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. నెలరోజుల తరువాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్ కుమార్ మంగళవారం అచార్య యార్లగడ్డకు డిల్లీలో స్వాగతం పలికి మెమొంటో, శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో యార్లగడ్డ మంగళవారం అమెరికా బయలు దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







