స్వదేశానికి హత్యకు గురైన భారతీయ ప్రవాసుడి మృతదేహం
- January 24, 2024
యూఏఈ: యూఏఈలో హత్యకు గురైన భారతీయ ప్రవాసుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. కొన్నేళ్లుగా స్థానిక టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ విన్సెంట్ ఈ నెల ప్రారంభంలో కనిపించకుండా పోయాడు. "అతను 35 సంవత్సరాలుగా ఒక కంపెనీకి PRO గా పని చేస్తున్నాడు. జనవరి 2వ తేదీన రస్ అల్ ఖోర్లోని కంపెనీ నుంచి కనిపించకుండా పోయాడు." అని భారతీయ సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి చెప్పారు. అనిల్ కొడుకు భారతదేశం నుండి దుబాయ్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. జనవరి 12న అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. అతని మృతదేహం షార్జాలోని మారుమూల ఎడారిలో గుర్తించారు. ఓ గొడవలో గాయపడి అనిల్ మరణించాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కొంత మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కేసు ఇంకా విచారణలో ఉందిని వివరించారు. 59 ఏళ్ల మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఛాతీపై గాయాలు, గొంతు నులిమి చంపినట్లు ఎంబామింగ్ సర్టిఫికేట్ లో పేర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







