కుమార్తెకు పాస్పోర్ట్ కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంలో గెలిచిన తండ్రి
- January 26, 2024
బహ్రెయిన్: ఒక బహ్రెయిన్ తండ్రి అతని ఆరేళ్ల కుమార్తె కోసం అధికారిక డాక్యుమెంటేషన్ మరియు పాస్పోర్ట్ పొందే హక్కును పొందేందుకు సివిల్ కోర్టులో సుదీర్ఘంగా పోరాటం చేసి విజయం సాధించారు. అతని భార్య నుండి విడిపోయిన ఏడాది తరువాత ఈ తీర్పు వచ్చింది. భర్త తరఫు న్యాయవాది జహ్రా నామా మాట్లాడుతూ.. తన క్లయింట్ ఆరు సంవత్సరాల క్రితం తన బిడ్డ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఈ కేసులో సుప్రీం షరియా కోర్టు వారి వైవాహిక సంబంధం ఉనికిని ధృవీకరించిందని, భర్త యొక్క పితృత్వాన్ని ధృవీకరించిందని, ఈ వాస్తవాలను ధృవీకరించే అధికారిక పత్రాన్ని జారీ చేసిందన్నారు. ఇవన్ని తన కుమర్తెకు బహ్రెయిన్ పాస్పోర్ట్ రావాడానికి రుజువుగా పనిచేశాయని తెలిపారు. బిడ్డ పుట్టినప్పటి నుండి బహ్రెయిన్ పౌరురాలిగా గుర్తించింది. బహ్రెయిన్ జాతీయతతో అనుబంధించబడిన పూర్తి హక్కులకు ఆమెకు హక్కు కల్పించాలని ఆదేశించింది. బహ్రెయిన్ పాస్పోర్ట్ మరియు గుర్తింపు కార్డును వెంటనే అందజేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు







