కుమార్తెకు పాస్పోర్ట్ కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంలో గెలిచిన తండ్రి
- January 26, 2024
బహ్రెయిన్: ఒక బహ్రెయిన్ తండ్రి అతని ఆరేళ్ల కుమార్తె కోసం అధికారిక డాక్యుమెంటేషన్ మరియు పాస్పోర్ట్ పొందే హక్కును పొందేందుకు సివిల్ కోర్టులో సుదీర్ఘంగా పోరాటం చేసి విజయం సాధించారు. అతని భార్య నుండి విడిపోయిన ఏడాది తరువాత ఈ తీర్పు వచ్చింది. భర్త తరఫు న్యాయవాది జహ్రా నామా మాట్లాడుతూ.. తన క్లయింట్ ఆరు సంవత్సరాల క్రితం తన బిడ్డ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఈ కేసులో సుప్రీం షరియా కోర్టు వారి వైవాహిక సంబంధం ఉనికిని ధృవీకరించిందని, భర్త యొక్క పితృత్వాన్ని ధృవీకరించిందని, ఈ వాస్తవాలను ధృవీకరించే అధికారిక పత్రాన్ని జారీ చేసిందన్నారు. ఇవన్ని తన కుమర్తెకు బహ్రెయిన్ పాస్పోర్ట్ రావాడానికి రుజువుగా పనిచేశాయని తెలిపారు. బిడ్డ పుట్టినప్పటి నుండి బహ్రెయిన్ పౌరురాలిగా గుర్తించింది. బహ్రెయిన్ జాతీయతతో అనుబంధించబడిన పూర్తి హక్కులకు ఆమెకు హక్కు కల్పించాలని ఆదేశించింది. బహ్రెయిన్ పాస్పోర్ట్ మరియు గుర్తింపు కార్డును వెంటనే అందజేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







