ముగిసిన అల్ మౌజ్ మస్కట్ మారథాన్-2024
- January 28, 2024
మస్కట్: అల్ మౌజ్ మస్కట్ మారథాన్ -2024 పోటీలు జనవరి 27న ముగిశాయి. ఇందులో ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో నివసిస్తున్న ఒమానీ , విదేశీ అథ్లెట్లు పాల్గొన్నారు. 5 కి.మీ మారథాన్ పోటీల్లో అబ్దుల్లా అల్ ఖురైనీ ప్రథమ స్థానం, సేలం అల్ రషీది ద్వితీయ స్థానం సాధించగా.. తృతీయ స్థానంలో నాసర్ అల్ నబీ నిలిచారు. 3 కి.మీల పోటీలో విస్సామ్ అల్ మహరమి ప్రథమ స్థానం పొందారు. షాహీన్ గౌరీ ద్వితీయ స్థానం, జైద్ అల్ ధామ్రీ తృతీయ స్థానంలో నిలిచారు. 2 కిలోమీటర్ల పోటీలో తుర్కీ అల్-సుదైరి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో అవ్స్ అల్ ఫహదీ, తృతీయ స్థానంలో మాలిక్ అహ్మద్ నిలిచారు. చిన్నారుల కోసం జరిగిన 1 కిలోమీటరు పోటీలో తారిఖ్ బీరకదర్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మిషారీ అల్ బలూషి, తృతీయ స్థానంలో ఒసామా అల్ బహ్రీ నిలిచారు. SABCO స్పోర్ట్స్ కంపెనీ (అల్ మౌజ్ మస్కట్ మారథాన్ ఆర్గనైజింగ్ కంపెనీ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఖలీద్ బిన్ హమద్ అల్ బుసైది మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్ లో అల్ మౌజ్ మస్కట్ మారథాన్ అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. ఇది ప్రపంచ అథ్లెటిక్స్ ఫెడరేషన్లచే కూడా గుర్తింపు పొందిందని వివరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







