సీఫ్ మాల్లో అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 28, 2024
బహ్రెయిన్: మనామాలోని సీఫ్ మాల్లో ప్రఖ్యాత అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్, వేలం ఆరవ ఎడిషన్ ప్రారంభం అయింది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ మర్వాన్ ఫౌద్ కమల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్కు 14 దేశాల వారు పాల్గొంటున్నారు. ఉమయ్యద్ మరియు సస్సానిద్ నాణేలు, ఇరాక్ రాజు ఫైసల్ I నాణేలు, అలాగే అరుదైన గల్ఫ్ నాణేలు మరియు 1780 నాటి ఎంప్రెస్ థెరిసా ఆఫ్ ఆస్ట్రియా నాణేలతో సహా అరుదైన చారిత్రక కరెన్సీల ఆకర్షణీయమైన శ్రేణిని కలిగి ఉన్న ప్రదర్శనను అండర్ సెక్రటరీ అబ్బాసిద్ తిలకించారు. ప్రపంచ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. యువతకు వారి అభిరుచులలో మద్దతు ఇవ్వడంలో.. ప్రోత్సహించడంలో ఎగ్జిబిషన్ కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారు. అరుదైన కరెన్సీలను ప్రదర్శించడానికి, మార్కెట్ చేయడానికి ఇది వేదికగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









