ఢిల్లీలోని కల్కాజీ మందిర్‌లో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

- January 28, 2024 , by Maagulf
ఢిల్లీలోని కల్కాజీ మందిర్‌లో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్‌ (కాళికా దేవి మందిరం)లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ క్రమంలో భక్తులు ప్రొగ్రాంకు పెద్దఎత్తున హాజరయ్యారు. మరోవైపు జాగరణ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com