ఆహారపదార్థాల గడువు తేదీ మార్పు.. దుకాణం మూసివేత
- January 28, 2024
కువైట్: ఆహార పదార్థాల గడువు తేదీని పొడిగించిన దుకాణాన్ని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు మూసివేశారు. నివేదికల ప్రకారం.. దుకాణం గడువు ముగిసిన ఆహార పదార్థాలు, మొలాసిస్లను నిల్వ చేసింది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు మరియు కేఫ్లకు విక్రయించేందుకు వీలుగా వాటిపైనే ఉన్న గడువు తేదీని మార్చింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు.. గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









