సీసీఎల్కు సర్వం సిద్దం..
- January 28, 2024
యూఏఈ: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) పదో ఎడిషన్కు రంగం సిద్దమైంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఫిబ్రవరి 23న యూఏఈలోని షార్జాలో ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మధ్య బ్లాక్ బస్టర్ క్లాష్తో ప్రారంభమవుతుంది. ఎనిమిది చలనచిత్ర పరిశ్రమలకు చెందిన సూపర్స్టార్లతో కూడిన మొత్తం ఎనిమిది జట్లు పాల్గోననున్నాయి. ఈ సీసీఎల్ 10వ ఎడిషన్ 24 రోజుల పాటు ఆరు వేదికలలో జరుగనుంది. షార్జాలో మూడు మ్యాచ్లు జరిగిన తర్వాత, లీగ్ ఇండియా వేదికగా నిర్వహించనున్నారు. దీనికి హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్లో డిసెంబర్ 16న పంజాబ్ ఎడ్యుకేటర్స్పై PDS విజయం సాధించింది. పంజాబ్ డి షేర్ వర్సెస్ IRS ఆఫీసర్స్ XI మధ్య రెండవ గేమ్ జనవరి 27, శనివారం ముల్లన్పూర్ పంజాబ్లోని మహరాజ్ యాదవేందర్ సింగ్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. జనవరి 27న తలపడిన IRS ఆఫీసర్స్ తో తలపడిన పంజాబ్ XI టీం ఇలా ఉంది.
- గురుప్రీత్ ఘుగ్గీ
- బిన్ను ధిల్లాన్
- నింజా
- జాస్సీ గిల్
- బబ్బల్ రాయ్
- మన్మీత్ సింగ్ (మీట్ బ్రదర్స్)
- దేవ్ ఖరోడ్
- గవీ చానెల్
- సుయాష్ రాయ్
- దక్ష్ అజిత్ సింగ్
- మయూర్ మెహతా
- అనుజ్ ఖురానా
- రాహుల్ జైట్లీ

తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







