భారతదేశానికి ఫ్రీక్వెన్సీని తగ్గించిన ఒమన్ ఎయిర్!
- January 30, 2024
యూఏఈ: ఆర్థిక పనితీరును మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఒమన్ జాతీయ క్యారియర్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలకు విమాన ఫ్రీక్వెన్సీలను సవరించింది. ఇస్లామాబాద్, లాహోర్, కొలంబో మరియు చిట్టగాంగ్లకు తమ కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. అయితే పాకిస్తాన్ నగరమైన సియాల్కోట్ను తన నెట్వర్క్లో చేర్చుకున్నట్లు తెలిపింది. భారతీయ మార్గంలో లక్నో, తిరువనంతపురం అనే రెండు ప్రస్తుత గమ్యస్థానాలకు సామర్థ్యాన్ని పెంచుతూ, నిర్దిష్ట మార్కెట్లకు ఫ్రీక్వెన్సీలను కూడా తగ్గించినట్లు వెల్లడించింది. నవంబర్ 2023లో ఒమన్ యొక్క సలామ్ ఎయిర్ హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఐదు కీలక భారతీయ నగరాలకు విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశానికి విమాన హక్కుల కేటాయింపుల పరిమితి కారణంగా విమానాలు నిలిపివేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









