ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మాణనికి యోచన
- January 30, 2024
హైదరాబాద్: ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ ను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. పటౌడీ హౌస్ లో ఉన్న ఐదున్నర ఎకరాల ప్రాంతంలో ఈ భవనాన్ని నిర్మించాలని యోచిస్తోంది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఈ భవనంపై వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం యొక్క విస్తీర్ణం, ఎన్ని గదులు ఉన్నాయి తదితర వివరాల గురించి ఆరా తీశారు.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ పై మార్చిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలను చేపట్టిన మల్లు రవి తెలంగాణ భవన్ నిర్మాణంపై పూర్తి దృష్టిని సారించారు. రాష్ట్రం ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తామని మల్లు రవి తెలిపారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









