పారిశ్రామిక ప్రదేశాలలో సివిల్ డిఫెన్స్ తనిఖీలు
- February 01, 2024
బహ్రెయిన్: పారిశ్రామిక రంగాలలో ప్రజల భద్రత, నివారణ చర్యలను పెంపొందించడానికి వీలుగా సివిల్ డిఫెన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క రక్షణ - భద్రత విభాగం కీలకమైన తనిఖీ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. కఠినమైన భద్రతా ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండే లక్ష్యంతో రసాయన కార్యకలాపాలలో ఉన్న పారిశ్రామిక కంపెనీలపై దృష్టి పెట్టింది. తనిఖీల సందర్భంగా డిపార్ట్మెంట్ ప్రజా భద్రతా, నివారణ చర్యలను నిశితంగా సమీక్షించింది. ప్రమాదకర పదార్థాలను నిర్వహించడానికి, వాటి స్వభావం, లక్షణాలు మరియు వచ్చే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భద్రతా పరికరాలు, అలారం వ్యవస్థలు, అలాగే తగినంత అగ్నిమాపక వ్యవస్థలు మరియు పరికరాల ఉనికిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రదేశాలలో తగిన ప్రమాణాలను పాటించాల్సి ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







