పారిశ్రామిక ప్రదేశాలలో సివిల్ డిఫెన్స్ తనిఖీలు
- February 01, 2024
బహ్రెయిన్: పారిశ్రామిక రంగాలలో ప్రజల భద్రత, నివారణ చర్యలను పెంపొందించడానికి వీలుగా సివిల్ డిఫెన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క రక్షణ - భద్రత విభాగం కీలకమైన తనిఖీ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. కఠినమైన భద్రతా ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండే లక్ష్యంతో రసాయన కార్యకలాపాలలో ఉన్న పారిశ్రామిక కంపెనీలపై దృష్టి పెట్టింది. తనిఖీల సందర్భంగా డిపార్ట్మెంట్ ప్రజా భద్రతా, నివారణ చర్యలను నిశితంగా సమీక్షించింది. ప్రమాదకర పదార్థాలను నిర్వహించడానికి, వాటి స్వభావం, లక్షణాలు మరియు వచ్చే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భద్రతా పరికరాలు, అలారం వ్యవస్థలు, అలాగే తగినంత అగ్నిమాపక వ్యవస్థలు మరియు పరికరాల ఉనికిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రదేశాలలో తగిన ప్రమాణాలను పాటించాల్సి ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







