అబుధాబిలోని BAPS హిందూ దేవాలయం అద్భుతం..!!
- February 01, 2024
యూఏఈ: అబుధాబిలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ ఆలయం సామరస్యం యొక్క ఆధ్యాత్మిక ఒయాసిస్గా ప్రశంసలు అందుకుంటుంది. ఇది చేతితో చెక్కిన శిల్పాల యొక్క నిర్మాణ కళాఖండంగా.. భారత ఆధ్యాత్మిక, పౌరాణిక కథలు,గాధల నిధిగా నిలువనుంది. BAPS హిందూ మందిర్ ప్రతి ఎమిరేట్కు ప్రాతినిధ్యం వహించే ఏడు ఎత్తైన గోపురాలతో.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో రెండు అద్భుతమైన గోపురాలతో అత్యద్భుతంగా నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మణం తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 14న BAPS స్వామినారాయణ్ సంస్థ యొక్క ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు, పవిత్ర మహంత్ స్వామి మహరాజ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆలయాన్ని ప్రారంభోత్సం చేయనున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల ద్వారా ఫిబ్రవరి 18 నుండి ప్రజలు ఆలయాన్ని సందర్శించేందుకు అవకాశం కల్పించారు.
భారతదేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారులచే ఆలయాన్ని నిర్మిస్తున్నారు. పింక్ ఇసుకరాయి నిర్మాణం మానవత్వం యొక్క అన్ని కలుపుకొని పోయే స్ఫూర్తికి నిదర్శనం. ఇక్కడ హిందూ మతం మాత్రమే కాకుండా వివిధ మతాలు, నాగరికతలకు ప్రాతినిధ్యం కల్పించారు. హస్తకళాకారులు అబుధాబిలోని BAPS హిందూ మందిర్లో హిందూ గ్రంధాల నుండి కథలను వర్ణించే రాతి శిల్పాలకు తుది మెరుగులు దిద్దారు. 1997లో షార్జాలోని ఎడారి మధ్యలో ఉన్నప్పుడు, అబుధాబిలో ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్న సంస్థ దివంగత ఆధ్యాత్మిక నాయకుడు, హిస్ హోలీనెస్ ప్రముఖ్ స్వామి మహారాజ్ కు నివాళిగా ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు అద్భుతమైన జలపాతం సందర్శకులను పలకరిస్తుంది. ఇది పవిత్ర భారతీయ నదులైన గంగ, యమునా మరియు సరస్వతి సంగమాన్ని సూచిస్తుంది. ఆలయం లోపల చల్లగా ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్లోరింగ్ నిర్మించారు. ఎకో-ఫ్రెండ్లీ షూ హౌస్లు ఉన్నాయి. ఫుడ్ కోర్ట్లోని బెంచీలు, బల్లలు మరియు కుర్చీలు రాళ్లను రవాణా చేయడానికి ఉపయోగించే చెక్క ప్యాలెట్లను తిరిగి ఉపయోగించడం ద్వారా తయారు చేయబడ్డాయి. ఆలయ అంతర్గత గోడలపై భారతీయ ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, హిందూ గ్రంధాలు మరియు పురాణాల నుండి ఇతర కథనాల నుండి కీలక ఘట్టాలను శిల్పాల రూపంలో రూపొందించారు. పురాతన హిందూ 'శిల్ప శాస్త్రాలు' - సంస్కృత వాస్తు గ్రంధాల ప్రకారం నిర్మించిన ఆలయం.. అరేబియా, ఈజిప్షియన్, మెసొపొటేమియన్, అజ్టెక్ మరియు భారతీయ నాగరికతల నుండి ఎంపిక చేయబడిన విలువైన కథల వర్ణనలను వివరిస్తున్నాయి. అదేవిధంగా ఆలయం లోపల ప్రత్యేకంగా నిలచే 'డోమ్ ఆఫ్ హార్మొనీ' అనేది భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే పంచభూతాలకు సారాంశాలకు ప్రతీక. 'డోమ్ ఆఫ్ పీస్' దాని కళాకృతికి అద్భుతమైనది. స్వామినారాయణ, రాముడు, సీత, కృష్ణుడు, అయ్యప్పతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే హిందూ దేవతా విగ్రహాలనుఆలయంలో ప్రతిష్టించనున్నారు.





తాజా వార్తలు
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!









