దుబాయ్లో తొలిసారిగా ఖైదీల కోసం ఫుట్బాల్ లీగ్
- February 01, 2024
దుబాయ్: ఎమిరేట్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం దుబాయ్ తొలిసారిగా ఫుట్బాల్ లీగ్ను ప్రకటించింది. పద్నాలుగు జట్లు పాల్గొనే ఈ ఈవెంట్ ఏప్రిల్ 7 నుండి మే 31 వరకు అల్ అవీర్ జైలులో జరుగుతుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ ప్రాక్టీస్ సెషన్లను మరియు డిటెన్షన్ సెంటర్లలో శారీరక వ్యాయామాలను ప్రారంభించాయని అధికారులు తెలిపారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ (DSC) మరియు దుబాయ్ పోలీసులు ఈ మ్యాచ్లను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దుబాయ్ పోలీస్లోని శిక్షాత్మక మరియు కరెక్షనల్ ఎస్టాబ్లిష్మెంట్ల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మర్వాన్ అబ్దుల్ కరీమ్ జుల్ఫర్ మాట్లాడుతూ.. ఇలాంటి క్రీడలు ఖైదీల్లో మార్పును తీసుకొస్తుందని, జైలులో ఉన్న సమయం కంటే ఎక్కువగా వారు బయటి సమాజంలో జీవించడానికి సన్నద్ధులను చేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. "మా 'అతిథులు' వారి భవిష్యత్ ప్రయత్నాలకు ప్రయోజనకరమైన నైపుణ్యాలతో బయలుదేరడం, ఇతరులతో కలిసి సామరస్యపూర్వకంగా సహజీవనం చేసే, నేర్చుకునే మరియు అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని పొందిన వ్యక్తులుగా రూపాంతరం చెందడం.. వారు వారి ప్రారంభ స్థితి కంటే మెరుగైన వ్యక్తులుగా ఉద్భవించాలనేది మా ఆకాంక్ష.’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









