BAPS హిందూ దేవాలయ సందర్శనకు విదేశాల నుండి భారీ డిమాండ్
- February 02, 2024
యూఏఈ: ఫిబ్రవరి 18న భక్తులు అందుబాటులోకి రానున్న చారిత్రాత్మక BAPS హిందూ మందిర్ను సందర్శించడానికి విదేశాల నుండి వచ్చిన వారితో సహా సందర్శకుల నుండి భారీ డిమాండ్ ఉందని ఆలయ ప్రాజెక్ట్ అధిపతి తెలిపారు. పింక్ ఇసుకరాయి ఆలయ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 14 న జరగనుండగా.. ఫిబ్రవరి 18 నుండి సాధారణ ప్రజలకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. కళాకారులు చేతితో చెక్కిన రాతి శిల్పాలు మరియు ప్రత్యేక లక్షణాల శ్రేణితో ఈ ఆలయం యూఏఈతోపాటు విదేశాలలో ఉండేవారిని ఆకర్షిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని BAPS స్వామినారాయణ్ సంస్థ గత సంవత్సరం ప్రజల కోసం ఆలయ సందర్శన కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఫిబ్రవరి 18న ప్రారంభం రోజున నమోదు చేసుకున్న యూఏఈ నివాసితులు హాజరు కావచ్చు. అయినప్పటికీ, మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ రాతి ఆలయాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్న విదేశీ సందర్శకుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, ఇంకా నమోదు చేసుకోని నివాసితులు మార్చి 1 నుండి సందర్శించవలసిందిగా ఆలయ అధికారులు కోరారు. “ఇప్పటికే నమోదు చేసుకున్న విదేశీ సందర్శకుల నుండి భారీ ఆసక్తి ఉంది. కాబట్టి, యూఏఈ నివాసితులను మార్చి 1 తర్వాత సందర్శించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము” అని BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ అధిపతి పూజ్య స్వామి బ్రహ్మవిహారిదాస్ చెప్పారు. మార్చి 1 నుండి ఆలయాన్ని సందర్శించాలనుకునే సంఘం సభ్యులు ప్రత్యేక వెబ్సైట్ లేదా ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పింక్ ఇసుకరాయి దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' పేరుతో గ్రాండ్ ఓపెనింగ్ కోసం అద్భుత నిర్మాణానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







