జీరో బ్యూరోక్రసీ ప్రోగ్రామ్‌ ప్రకటించిన షేక్ మొహమ్మద్

- February 02, 2024 , by Maagulf
జీరో బ్యూరోక్రసీ ప్రోగ్రామ్‌ ప్రకటించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభుత్వంలో బ్యూరోక్రసీని తగ్గించడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఒక సంవత్సరంలో 2,000 విధానాలను రద్దు చేయడానికి మరియు ప్రభుత్వ సేవలలో తీసుకునే సమయాన్ని 50 శాతం తగ్గించడానికి ప్రభుత్వ ఏజెన్సీలు పని చేసే కార్యక్రమాన్ని ప్రకటించారు. అనవసరమైన విధానాలను తొలగించడంలో రాణిస్తున్న ఉద్యోగి లేదా బృందానికి 1 మిలియన్ దిర్హామ్‌ల ప్రోత్సాహకాలను ప్రకటించామని షేక్ మహమ్మద్ తెలిపారు.షేక్ మొహమ్మద్ తన ట్వీట్‌లో "ప్రజల జీవితాలను సులభతరం చేయడమే మా లక్ష్యం. యూఏఈలో ప్రజలు సౌకర్యవంతంగా మరియు ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. సేవలను అందించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రభుత్వంగా ఉండటమే మా లక్ష్యం." అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com