టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..
- February 05, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది టీటీడీ. దీనితో చాలా మంది భక్తులకు ఊరట కలుగుతుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇక నుంచి ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఎంబీసీ 34లోని కౌంటర్ దగ్గర టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఒక లింక్ తో కూడిన మెసేజ్ వస్తుంది. భక్తులు ఆ లింకుపై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించి.. ఆన్ లైన్ లోనే నగదు చెల్లించి.. టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. టీటీడీ 2 రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







