టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..

- February 05, 2024 , by Maagulf
టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది టీటీడీ. దీనితో చాలా మంది భక్తులకు ఊరట కలుగుతుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇక నుంచి ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఎంబీసీ 34లోని కౌంటర్ దగ్గర టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఒక లింక్ తో కూడిన మెసేజ్ వస్తుంది. భక్తులు ఆ లింకుపై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించి.. ఆన్ లైన్ లోనే నగదు చెల్లించి.. టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. టీటీడీ 2 రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com