టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..
- February 05, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది టీటీడీ. దీనితో చాలా మంది భక్తులకు ఊరట కలుగుతుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇక నుంచి ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఎంబీసీ 34లోని కౌంటర్ దగ్గర టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఒక లింక్ తో కూడిన మెసేజ్ వస్తుంది. భక్తులు ఆ లింకుపై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించి.. ఆన్ లైన్ లోనే నగదు చెల్లించి.. టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. టీటీడీ 2 రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







