రేపటి నుంచి అందుబాటులోకి 'భారత్ రైస్'..
- February 06, 2024
న్యూ ఢిల్లీ: భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఫిక్స్ అయ్యింది. రేపు ( ఫిబ్రవరి 6న) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు.
తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి వస్తువు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కొని కడుపునిండా కమ్మగా తినలేని పరిస్థితి. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఇలా వేటి ధరలు చూసినా భగ్గుమంటున్నాయి. ఇక బియ్యం ధరలైతే చెప్పక్కర్లేదు. సాధారణ బియ్యమే రూ.40 పెట్టనిది రావడం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా 'భారత్ రైస్' అనే బ్రాండ్ను తీసుకొస్తుంది. ఈ బియ్యం రూ.29కే కిలో అందించేందుకు సిద్ధమైంది.
భారత్ గోదుమపిండిని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 06, 2023న ప్రారంభించింది. దేశంలో సగటు గోదుమపిండి ధర రూ.35 ఉండగా.. భారత్ గోదుమపిండి ధర రూ.27.50 కే లభిస్తుంది. శనగ పప్పు కిలో రూ.60కి లభిస్తుంది. భారత్ రైస్ కి సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







