అధికారిక చర్చలు జరిపిన సుల్తాన్, కువైట్ ఎమిర్

- February 07, 2024 , by Maagulf
అధికారిక చర్చలు జరిపిన సుల్తాన్, కువైట్ ఎమిర్

మస్కట్‌: కువైట్‌ రాష్ట్ర అమీర్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, షేక్‌ మిషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జాబర్‌ అల్‌ సబాహ్‌ మంగళవారం అల్‌ ఆలం ప్యాలెస్‌లో అధికారికంగా చర్చలు జరిపారు.   ఒమన్ - కువైట్‌ల మధ్య ఉన్న విశిష్ట సంబంధాలను ఈ సందర్భంగా వారు సమీక్షించారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారం, ప్రజల మధ్య సోదర సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఒమాన్ తరఫున మంత్రి మండలి ఉప ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సైద్, అంతర్జాతీయ సంబంధాల మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ తదితరులు పాల్గొన్నారు. కువైట్ నుంచి షేక్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ అల్ జర్రాహ్ అల్ సబా, షేక్ హమద్ సబా అల్ అహ్మద్ అల్ సబా, షేక్ ముబారక్ అల్ హమూద్ అల్ జబర్ అల్ సబా, షేక్ అత్బీ నాసిర్ అల్ అత్బీ అల్ సబా, షేక్ అలీ ఖలీద్ అల్ జబర్ అల్ సబా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com