అధికారిక చర్చలు జరిపిన సుల్తాన్, కువైట్ ఎమిర్
- February 07, 2024
మస్కట్: కువైట్ రాష్ట్ర అమీర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ మంగళవారం అల్ ఆలం ప్యాలెస్లో అధికారికంగా చర్చలు జరిపారు. ఒమన్ - కువైట్ల మధ్య ఉన్న విశిష్ట సంబంధాలను ఈ సందర్భంగా వారు సమీక్షించారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారం, ప్రజల మధ్య సోదర సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఒమాన్ తరఫున మంత్రి మండలి ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సైద్, అంతర్జాతీయ సంబంధాల మంత్రి హెచ్హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ తదితరులు పాల్గొన్నారు. కువైట్ నుంచి షేక్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ అల్ జర్రాహ్ అల్ సబా, షేక్ హమద్ సబా అల్ అహ్మద్ అల్ సబా, షేక్ ముబారక్ అల్ హమూద్ అల్ జబర్ అల్ సబా, షేక్ అత్బీ నాసిర్ అల్ అత్బీ అల్ సబా, షేక్ అలీ ఖలీద్ అల్ జబర్ అల్ సబా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







