మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh200,000 వరకు జరిమానా, జైలు శిక్ష
- February 07, 2024
యూఏఈ: కొత్తగా ప్రవేశపెట్టిన ఫెడరల్ చట్టం మే 30, 2024 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం మానసిక ఆరోగ్య రోగులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే Dh200,000 జరిమానా మరియు రోగికి తీవ్రమైన గాయం లేదా శారీరక వైకల్యానికి కారణమైతే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను విధిస్తారు. కొత్త చట్టంలో మానసిక ఆరోగ్య రోగులకు సంబంధించిన అనేక రకాల కొత్త నిబంధనలతో పాటు జరిమానాల వివరాలను పొందుపరిచారు. గలాదరి లీగల్ కన్సల్టెంట్ సీనియర్ న్యాయవాది స్టీఫెన్ బాలంటైన్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని మానసిక ఆరోగ్య సౌకర్యం కోసం అనుమతించడం లేదా డిశ్చార్జ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా సరికాని సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అందించిన వారికి చట్టం కఠినమైన జరిమానాలను విధిస్తుంది. వీటితో పాటు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతని/ఆమె మెడికల్ రిపోర్ట్లో మానసిక స్థితికి సంబంధించి వాస్తవికతకు విరుద్ధంగా పేర్కొన్నట్టయితే చట్టం Dh50,000 కంటే తక్కువ కాకుండా మరియు Dh200,000 మించకుండా జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారికి తగిన సంరక్షణ మరియు వారికి తగిన గౌరవం లభించేలా చూడడానికి జరిమానాలు ప్రవేశపెట్టబడ్డాయి అని బాలంటైన్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







