మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh200,000 వరకు జరిమానా, జైలు శిక్ష
- February 07, 2024
యూఏఈ: కొత్తగా ప్రవేశపెట్టిన ఫెడరల్ చట్టం మే 30, 2024 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం మానసిక ఆరోగ్య రోగులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే Dh200,000 జరిమానా మరియు రోగికి తీవ్రమైన గాయం లేదా శారీరక వైకల్యానికి కారణమైతే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను విధిస్తారు. కొత్త చట్టంలో మానసిక ఆరోగ్య రోగులకు సంబంధించిన అనేక రకాల కొత్త నిబంధనలతో పాటు జరిమానాల వివరాలను పొందుపరిచారు. గలాదరి లీగల్ కన్సల్టెంట్ సీనియర్ న్యాయవాది స్టీఫెన్ బాలంటైన్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని మానసిక ఆరోగ్య సౌకర్యం కోసం అనుమతించడం లేదా డిశ్చార్జ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా సరికాని సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అందించిన వారికి చట్టం కఠినమైన జరిమానాలను విధిస్తుంది. వీటితో పాటు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతని/ఆమె మెడికల్ రిపోర్ట్లో మానసిక స్థితికి సంబంధించి వాస్తవికతకు విరుద్ధంగా పేర్కొన్నట్టయితే చట్టం Dh50,000 కంటే తక్కువ కాకుండా మరియు Dh200,000 మించకుండా జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారికి తగిన సంరక్షణ మరియు వారికి తగిన గౌరవం లభించేలా చూడడానికి జరిమానాలు ప్రవేశపెట్టబడ్డాయి అని బాలంటైన్ తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







