ముంబై తీరానికి సమీపంలో కువైట్ బోట్.. పోలీసుల దర్యాప్తు
- February 08, 2024
ముంబై: ముంబై తీర ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫిషింగ్ బోటు కనిపించడంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న "అబ్దుల్లా షరీఫ్" అనే బోటు దొరికింది. పడవలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారందరూ తమిళనాడులోని కన్యాకుమారికి చెందినవారని, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు నిందితుల నుంచి అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పేర్కొన్నారు. "పడవ కువైట్ నుండి వచ్చింది. స్వాధీనం చేసుకున్నాము. ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. కోలాబా పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు." అని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాము కన్యాకుమారి నుండి వచ్చామని , కువైట్లోని ఒక కంపెనీలో పని చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం, ఆహారం ఇవ్వకపోవడంతో పారిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ పాస్పోర్టులను యజమానులు స్వాధీనం చేసుకున్నారని, GPS సహాయంతో నావిగేట్ చేసుకుంటూ ముంబై చేరుకోవడానికి పది రోజులు పట్టిందని తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







