ముంబై తీరానికి సమీపంలో కువైట్ బోట్.. పోలీసుల దర్యాప్తు

- February 08, 2024 , by Maagulf
ముంబై తీరానికి సమీపంలో కువైట్ బోట్.. పోలీసుల దర్యాప్తు

ముంబై: ముంబై తీర ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫిషింగ్ బోటు కనిపించడంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న "అబ్దుల్లా షరీఫ్" అనే బోటు దొరికింది. పడవలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారందరూ తమిళనాడులోని కన్యాకుమారికి చెందినవారని, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు నిందితుల నుంచి అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పేర్కొన్నారు. "పడవ కువైట్ నుండి వచ్చింది.  స్వాధీనం చేసుకున్నాము. ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. కోలాబా పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు." అని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాము కన్యాకుమారి నుండి వచ్చామని ,  కువైట్‌లోని ఒక కంపెనీలో పని చేస్తున్నామని వెల్లడించారు.  దాదాపు రెండేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం, ఆహారం ఇవ్వకపోవడంతో పారిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ పాస్‌పోర్టులను యజమానులు స్వాధీనం చేసుకున్నారని, GPS సహాయంతో నావిగేట్ చేసుకుంటూ ముంబై చేరుకోవడానికి పది రోజులు పట్టిందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com