ముంబై తీరానికి సమీపంలో కువైట్ బోట్.. పోలీసుల దర్యాప్తు
- February 08, 2024
ముంబై: ముంబై తీర ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫిషింగ్ బోటు కనిపించడంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న "అబ్దుల్లా షరీఫ్" అనే బోటు దొరికింది. పడవలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారందరూ తమిళనాడులోని కన్యాకుమారికి చెందినవారని, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు నిందితుల నుంచి అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పేర్కొన్నారు. "పడవ కువైట్ నుండి వచ్చింది. స్వాధీనం చేసుకున్నాము. ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. కోలాబా పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు." అని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాము కన్యాకుమారి నుండి వచ్చామని , కువైట్లోని ఒక కంపెనీలో పని చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం, ఆహారం ఇవ్వకపోవడంతో పారిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ పాస్పోర్టులను యజమానులు స్వాధీనం చేసుకున్నారని, GPS సహాయంతో నావిగేట్ చేసుకుంటూ ముంబై చేరుకోవడానికి పది రోజులు పట్టిందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







