ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- February 08, 2024
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ప్రధాని నరేంద్ర మోడీ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు. 2000 సంవత్సరంలో ఆ కులాన్ని బిజెపి ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని అన్నారు. మోడీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ ఆరోపించారు. మోడీ ఓబీసీగా జన్మించనందునే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించేందుకు అనుమతించరని అన్నారు.
ఇక రాహుల్ యాత్ర గురువారం ఒడిషా నుంచి చత్తీస్ఘఢ్లోకి ప్రవేశించనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ ఓటమి పాలైన అనంతరం రాహుల్ తొలిసారిగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక రాహుల్ యాత్ర రాయ్ఘఢ్, కోర్బా జిల్లాల మీదుగా సాగుతూ ఫిబ్రవరి 14న బల్రాంపూర్ నుంచి జార్ఖండ్లోకి ప్రవేశిస్తుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







