ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- February 08, 2024
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ప్రధాని నరేంద్ర మోడీ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు. 2000 సంవత్సరంలో ఆ కులాన్ని బిజెపి ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని అన్నారు. మోడీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ ఆరోపించారు. మోడీ ఓబీసీగా జన్మించనందునే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించేందుకు అనుమతించరని అన్నారు.
ఇక రాహుల్ యాత్ర గురువారం ఒడిషా నుంచి చత్తీస్ఘఢ్లోకి ప్రవేశించనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ ఓటమి పాలైన అనంతరం రాహుల్ తొలిసారిగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక రాహుల్ యాత్ర రాయ్ఘఢ్, కోర్బా జిల్లాల మీదుగా సాగుతూ ఫిబ్రవరి 14న బల్రాంపూర్ నుంచి జార్ఖండ్లోకి ప్రవేశిస్తుంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









