పెట్రోల్ స్టేషన్లలోనూ ఫిర్యాదు..‘ ఆన్-ది-గో’తో సత్వర న్యాయం
- February 08, 2024
దుబాయ్: అనుమానాస్పద కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు, చట్టాల ఉల్లంఘనలను ఇకపై మీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. నివాసితులు, పర్యాటకులు అధికారుల నుండి సత్వర సహాయం కోసం ఇప్పుడు పోలీసు స్టేషన్ వరకు వెళ్లవలసిన అవసరం లేదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. దుబాయ్ పోలీసులు ఇటీవలే పెట్రోల్ కంపెనీలు ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఇనోక్), అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC), ఎమారాట్లతో కలిసి ఆన్-ది-గో అనే కొత్త సేవను అందించారు. ఈ వినూత్న సేవ వ్యక్తులు ఉల్లంఘనలను నివేదించడానికి, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో దోహదపడేందుకు మేలు చేస్తుందని దుబాయ్ పోలీసులు తెలిపారు. మొదటి లెఫ్టినెంట్ మజిద్ బిన్ సయీద్ అల్ కాబీ మాట్లాడుతూ.. "ఆన్-ది-గో" ద్వారా ఇంధనం నింపే స్టేషన్లలో పోలీసు సేవలను అందించడం ప్రపంచంలోనే మొదటి తరహదని అన్నారు. దుబాయ్లోని 138 పెట్రోల్ స్టేషన్లలో ఈ సేవలు అందించబడుతున్నాయని, కస్టమర్లకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన 11 సంస్థల నుండి మొత్తం 4,867 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







