దుబాయ్లో బంగారం కొని ఇతర దేశాల్లో ఎందుకు విక్రయిస్తున్నారు?
- February 08, 2024
యూఏఈ: దుకాణదారులు దుబాయ్లో బంగారం, విలువైన ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర దేశాలలో విక్రయిస్తున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా దక్షిణాసియా దేశాలలో ఎక్కువగా ఉంది. దుబాయ్లో విక్రయించే బంగారం, ఆభరణాల నాణ్యతపై వినియోగదారులకు ఉన్న నమ్మకం వల్లే ఇలా చేస్తున్నారని పరిశ్రమలోని వ్యాపారులు చెబుతున్నారు.అదే విధంగా ధరలలో ఉన్న వ్యత్యాసాల కారణంగా కొనుగోలుదారులు కూడా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కొన్ని దేశాలు బంగారం మరియు ఆభరణాల కొనుగోళ్లపై నిర్దిష్ట మొత్తానికి పైగా పన్ను విధిస్తున్నాయి. దుబాయ్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంపై పన్ను లేదు. ప్రయాణీకులు బంగారం , ఆభరణాలను తీసుకువెళ్లడానికి అనుమతించబడిన పరిమితికి మించి ఉంటే, ఆ వస్తువులను అధికారులు జప్తు చేయవచ్చు లేదా ఆయా దేశాల విధానాలను బట్టి ప్రయాణీకులు కస్టమ్స్ సుంకాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక సంవత్సరానికి పైగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పురుష ప్రయాణీకుడు రూ.50,000 (దిర్హాన్ 2,213) విలువైన ఆభరణాలను తీసుకువెళ్లడానికి అనుమతిస్తారు. అదే మహిళా ప్రయాణీకురాలు అయితే రూ.100,000 (Dh4,425 ) వరకు తీసుకెళ్లవచ్చు. యూఏఈ నివాసితులు, సందర్శకులు Dh60,000 కంటే ఎక్కువ విలువైన నగదు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను దేశంలోకి లేదా బయటికి వెళ్లేటప్పుడు దానిని వెల్లడించాలి. “కస్టమర్లు దుబాయ్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం, ఇతర దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో విక్రయించడాన్ని మేము గమనించాము. అయితే, నాణ్యతలో తేడాలు కాకుండా బంగారం ధరల్లోని తేడాలు కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తాయి" అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ అన్నారు. ఉదహరణకు బుధవారం దుబాయ్లో బంగారం 24K వేరియంట్ గ్రాముకు Dh246.5 (Rs5,570) వద్ద ట్రేడయింది. భారతదేశంలో 24K గ్రాము రూ.6,323 (Dh280) వద్ద ఉంది. బంగారం, వెండి కడ్డీలపై విధించే సుంకాలకు అనుగుణంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 11 నుంచి 15 శాతానికి భారత్ గత నెలలో పెంచిందని తెలిపారు. జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ మాట్లాడుతూ.. దుబాయ్ గోల్డెన్ మార్కెట్ యొక్క కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, ప్రామాణికత ప్రపంచ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







