దుబాయ్లో బంగారం కొని ఇతర దేశాల్లో ఎందుకు విక్రయిస్తున్నారు?
- February 08, 2024
యూఏఈ: దుకాణదారులు దుబాయ్లో బంగారం, విలువైన ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర దేశాలలో విక్రయిస్తున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా దక్షిణాసియా దేశాలలో ఎక్కువగా ఉంది. దుబాయ్లో విక్రయించే బంగారం, ఆభరణాల నాణ్యతపై వినియోగదారులకు ఉన్న నమ్మకం వల్లే ఇలా చేస్తున్నారని పరిశ్రమలోని వ్యాపారులు చెబుతున్నారు.అదే విధంగా ధరలలో ఉన్న వ్యత్యాసాల కారణంగా కొనుగోలుదారులు కూడా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కొన్ని దేశాలు బంగారం మరియు ఆభరణాల కొనుగోళ్లపై నిర్దిష్ట మొత్తానికి పైగా పన్ను విధిస్తున్నాయి. దుబాయ్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంపై పన్ను లేదు. ప్రయాణీకులు బంగారం , ఆభరణాలను తీసుకువెళ్లడానికి అనుమతించబడిన పరిమితికి మించి ఉంటే, ఆ వస్తువులను అధికారులు జప్తు చేయవచ్చు లేదా ఆయా దేశాల విధానాలను బట్టి ప్రయాణీకులు కస్టమ్స్ సుంకాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక సంవత్సరానికి పైగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పురుష ప్రయాణీకుడు రూ.50,000 (దిర్హాన్ 2,213) విలువైన ఆభరణాలను తీసుకువెళ్లడానికి అనుమతిస్తారు. అదే మహిళా ప్రయాణీకురాలు అయితే రూ.100,000 (Dh4,425 ) వరకు తీసుకెళ్లవచ్చు. యూఏఈ నివాసితులు, సందర్శకులు Dh60,000 కంటే ఎక్కువ విలువైన నగదు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను దేశంలోకి లేదా బయటికి వెళ్లేటప్పుడు దానిని వెల్లడించాలి. “కస్టమర్లు దుబాయ్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం, ఇతర దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో విక్రయించడాన్ని మేము గమనించాము. అయితే, నాణ్యతలో తేడాలు కాకుండా బంగారం ధరల్లోని తేడాలు కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తాయి" అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ అన్నారు. ఉదహరణకు బుధవారం దుబాయ్లో బంగారం 24K వేరియంట్ గ్రాముకు Dh246.5 (Rs5,570) వద్ద ట్రేడయింది. భారతదేశంలో 24K గ్రాము రూ.6,323 (Dh280) వద్ద ఉంది. బంగారం, వెండి కడ్డీలపై విధించే సుంకాలకు అనుగుణంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 11 నుంచి 15 శాతానికి భారత్ గత నెలలో పెంచిందని తెలిపారు. జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ మాట్లాడుతూ.. దుబాయ్ గోల్డెన్ మార్కెట్ యొక్క కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, ప్రామాణికత ప్రపంచ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







