మాదకద్రవ్యాల వ్యతిరేకతకు బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్
- June 01, 2016
కేరళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంగీకరించారు. బుధవారం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను సచిన్, చిరంజీవి, నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సచిన్ను కోరారు. ఆయన దీనికి అంగీకరించారు. ప్రచారానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని సచిన్ హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్గా ఉండాలని విజయన్ కోరారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మాట్లాడి వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర యువకులు క్రీడా సాధన చేసేందుకు ఫుట్బాల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కేరళ బ్లాస్టర్స్ ముఖ్యమంత్రిని కోరింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సాకర్ క్రీడాకారులను తయారు చేసి వారికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశమని సచిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్, ఆర్థిక మంత్రి టీఎం థామస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







