మాదకద్రవ్యాల వ్యతిరేకతకు బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్
- June 01, 2016
కేరళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంగీకరించారు. బుధవారం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను సచిన్, చిరంజీవి, నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సచిన్ను కోరారు. ఆయన దీనికి అంగీకరించారు. ప్రచారానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని సచిన్ హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్గా ఉండాలని విజయన్ కోరారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మాట్లాడి వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర యువకులు క్రీడా సాధన చేసేందుకు ఫుట్బాల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కేరళ బ్లాస్టర్స్ ముఖ్యమంత్రిని కోరింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సాకర్ క్రీడాకారులను తయారు చేసి వారికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశమని సచిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్, ఆర్థిక మంత్రి టీఎం థామస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







