తమిళనాడులో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మహిళా కార్మికులు మృతి
- February 08, 2024
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కార్మికులు మరణించారు.
ఊటీకి సమీపంలోని లవ్డేల్ ప్రాంతంలో ఓ పాత భవనాన్ని పునరుద్దరించే పనులను చేపట్టారు. దాదాపు 13 మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు మట్టి పని చేస్తుండగా భవనంలోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. కార్మికుల అరుపులు విన్నచుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. నలుగురు కార్మికులను రక్షించారు. వీరికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మృతులను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
కాగా.. మరో కార్మికుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







