తమిళనాడులో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మహిళా కార్మికులు మృతి
- February 08, 2024
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కార్మికులు మరణించారు.
ఊటీకి సమీపంలోని లవ్డేల్ ప్రాంతంలో ఓ పాత భవనాన్ని పునరుద్దరించే పనులను చేపట్టారు. దాదాపు 13 మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు మట్టి పని చేస్తుండగా భవనంలోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. కార్మికుల అరుపులు విన్నచుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. నలుగురు కార్మికులను రక్షించారు. వీరికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మృతులను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
కాగా.. మరో కార్మికుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









