CBSE బోర్డు పరీక్షలు:విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు
- February 09, 2024
యూఏఈ: భారతీయ పాఠ్యాంశ పాఠశాలల్లోని విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది. 10 మరియు 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి పేరెంట్స్ కు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు చేశారు.
క్రెడెన్స్ హైస్కూల్ CEO-ప్రిన్సిపాల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. “10 మరియు 12 తరగతుల విద్యార్థులకు ఇప్పుడు చాలా కీలకమైన కాలం. వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు అవసరం. వారు తమ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. గతంలో వచ్చిన ప్రశ్నలను సమీక్షించాలి. CBSE వెబ్సైట్లో అందించిన మోడల్ సమాధాన పత్రాలను రాయాలి.’’ అని వివరించారు. దుబాయ్లోని గల్ఫ్ ఇండియన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ అలీ కొట్టక్కుళం మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, స్టడీ మెటీరియల్లను నిరంతరం సాధన చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, చివరి నిమిషంలో కొత్త అంశాలకు దూరంగా ఉండాలని, బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో విద్యార్థులు చదివే ప్రాంతాలలో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తల్లిదండ్రులు అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. వారిపై ఒత్తిడి చేయకూడదని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







