CBSE బోర్డు పరీక్షలు:విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు
- February 09, 2024
యూఏఈ: భారతీయ పాఠ్యాంశ పాఠశాలల్లోని విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది. 10 మరియు 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి పేరెంట్స్ కు ప్రిన్సిపాల్స్ కీలక సూచనలు చేశారు.
క్రెడెన్స్ హైస్కూల్ CEO-ప్రిన్సిపాల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. “10 మరియు 12 తరగతుల విద్యార్థులకు ఇప్పుడు చాలా కీలకమైన కాలం. వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు అవసరం. వారు తమ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. గతంలో వచ్చిన ప్రశ్నలను సమీక్షించాలి. CBSE వెబ్సైట్లో అందించిన మోడల్ సమాధాన పత్రాలను రాయాలి.’’ అని వివరించారు. దుబాయ్లోని గల్ఫ్ ఇండియన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ అలీ కొట్టక్కుళం మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, స్టడీ మెటీరియల్లను నిరంతరం సాధన చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, చివరి నిమిషంలో కొత్త అంశాలకు దూరంగా ఉండాలని, బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో విద్యార్థులు చదివే ప్రాంతాలలో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తల్లిదండ్రులు అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. వారిపై ఒత్తిడి చేయకూడదని సూచించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







