కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు
- February 10, 2024
యూఏఈ: కదిలే కారు పైకప్పులపై కూర్చుని వెళ్ళే పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. తలను బయట పెట్టడం లేదా కిటికీ నుండి చేతులను బయట పెట్టడం వంటివి ప్రమాదకరమైన పద్ధతులని తెలిపింది. ఇలా చేసిన వారికి జరిమానా, బ్లాక్ పాయింట్లు విధించడంతో పాటు వాహనాన్ని కొంత కాలం పాటు జప్తు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ తరహా మొత్తం 1,183 ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని, 707 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాహనాల డ్రైవర్లకు 2,000 దిర్హామ్ల జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనం చేసుకోవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీనికి తోడు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి యజమాని మరో Dh50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







