కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు
- February 10, 2024
యూఏఈ: కదిలే కారు పైకప్పులపై కూర్చుని వెళ్ళే పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. తలను బయట పెట్టడం లేదా కిటికీ నుండి చేతులను బయట పెట్టడం వంటివి ప్రమాదకరమైన పద్ధతులని తెలిపింది. ఇలా చేసిన వారికి జరిమానా, బ్లాక్ పాయింట్లు విధించడంతో పాటు వాహనాన్ని కొంత కాలం పాటు జప్తు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ తరహా మొత్తం 1,183 ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని, 707 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాహనాల డ్రైవర్లకు 2,000 దిర్హామ్ల జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనం చేసుకోవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీనికి తోడు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి యజమాని మరో Dh50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







