కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు
- February 10, 2024
యూఏఈ: కదిలే కారు పైకప్పులపై కూర్చుని వెళ్ళే పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. తలను బయట పెట్టడం లేదా కిటికీ నుండి చేతులను బయట పెట్టడం వంటివి ప్రమాదకరమైన పద్ధతులని తెలిపింది. ఇలా చేసిన వారికి జరిమానా, బ్లాక్ పాయింట్లు విధించడంతో పాటు వాహనాన్ని కొంత కాలం పాటు జప్తు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ తరహా మొత్తం 1,183 ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని, 707 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాహనాల డ్రైవర్లకు 2,000 దిర్హామ్ల జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనం చేసుకోవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీనికి తోడు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి యజమాని మరో Dh50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం









