కదిలే కారు పైకప్పులపై పిల్లలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరికలు
- February 10, 2024
యూఏఈ: కదిలే కారు పైకప్పులపై కూర్చుని వెళ్ళే పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. తలను బయట పెట్టడం లేదా కిటికీ నుండి చేతులను బయట పెట్టడం వంటివి ప్రమాదకరమైన పద్ధతులని తెలిపింది. ఇలా చేసిన వారికి జరిమానా, బ్లాక్ పాయింట్లు విధించడంతో పాటు వాహనాన్ని కొంత కాలం పాటు జప్తు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ తరహా మొత్తం 1,183 ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని, 707 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాహనాల డ్రైవర్లకు 2,000 దిర్హామ్ల జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనం చేసుకోవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీనికి తోడు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి యజమాని మరో Dh50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







