సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి
- February 11, 2024
యూఏఈ: సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో యూఏఈ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు, ఒక బహ్రెయిన్ అధికారి మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో మరో ఇద్దరికి గాయాలైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందంలో భాగంగా సోమాలి సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సైనికుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







