సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి
- February 11, 2024
యూఏఈ: సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో యూఏఈ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు, ఒక బహ్రెయిన్ అధికారి మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో మరో ఇద్దరికి గాయాలైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందంలో భాగంగా సోమాలి సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సైనికుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









