నేరాల డాక్యుమెంట్ ప్రచురణపై అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- February 11, 2024
రియాద్: అన్ని రకాల నేరాలు జరిగిన సమయంలో ఫోటో తీయడం, ప్రచురించడం వంటివి చేయకూడదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క భద్రతా ప్రతినిధి కల్నల్ తలాల్ అల్-షల్హౌబ్ హెచ్చరించారు. ఇది సైబర్ క్రైమ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ డిఫెన్స్ షో 2024లో “సౌదీ స్ట్రీట్” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఒక నేరం లేదా నిర్దిష్ట సంఘటన ప్రత్యక్షంగా చిత్రీకరించిన ఫుటేజీని తప్పనిసరిగా భద్రతా అధికారులకు సమర్పించాలని, భద్రతా కార్యకలాపాల కేంద్రం 911లోని భద్రతా సిబ్బందికి తెలియజేయాలన్నారు. అటువంటి డాక్యుమెంటేషన్ను సోషల్ మీడియా డొమైన్లో ఎప్పుడూ పోస్ట్ చేయరాదని లేదా ప్రచురించకూడదని స్పష్టం చేశారు. డాక్యుమెంటేషన్ అనేది ఫోటోగ్రఫీకి మాత్రమే పరిమితం కాదని, స్టోర్లు, మార్కెట్లు మరియు ఇతర చోట్ల ఏర్పాటు చేసిన భద్రతా నిఘా కెమెరాల రికార్డింగ్లను కూడా పబ్లిక్ డొమైన్ లలో ప్రచురించడాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







