నేరాల డాక్యుమెంట్ ప్రచురణపై అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- February 11, 2024
రియాద్: అన్ని రకాల నేరాలు జరిగిన సమయంలో ఫోటో తీయడం, ప్రచురించడం వంటివి చేయకూడదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క భద్రతా ప్రతినిధి కల్నల్ తలాల్ అల్-షల్హౌబ్ హెచ్చరించారు. ఇది సైబర్ క్రైమ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ డిఫెన్స్ షో 2024లో “సౌదీ స్ట్రీట్” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఒక నేరం లేదా నిర్దిష్ట సంఘటన ప్రత్యక్షంగా చిత్రీకరించిన ఫుటేజీని తప్పనిసరిగా భద్రతా అధికారులకు సమర్పించాలని, భద్రతా కార్యకలాపాల కేంద్రం 911లోని భద్రతా సిబ్బందికి తెలియజేయాలన్నారు. అటువంటి డాక్యుమెంటేషన్ను సోషల్ మీడియా డొమైన్లో ఎప్పుడూ పోస్ట్ చేయరాదని లేదా ప్రచురించకూడదని స్పష్టం చేశారు. డాక్యుమెంటేషన్ అనేది ఫోటోగ్రఫీకి మాత్రమే పరిమితం కాదని, స్టోర్లు, మార్కెట్లు మరియు ఇతర చోట్ల ఏర్పాటు చేసిన భద్రతా నిఘా కెమెరాల రికార్డింగ్లను కూడా పబ్లిక్ డొమైన్ లలో ప్రచురించడాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







