నేరాల డాక్యుమెంట్ ప్రచురణపై అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- February 11, 2024
రియాద్: అన్ని రకాల నేరాలు జరిగిన సమయంలో ఫోటో తీయడం, ప్రచురించడం వంటివి చేయకూడదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క భద్రతా ప్రతినిధి కల్నల్ తలాల్ అల్-షల్హౌబ్ హెచ్చరించారు. ఇది సైబర్ క్రైమ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ డిఫెన్స్ షో 2024లో “సౌదీ స్ట్రీట్” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఒక నేరం లేదా నిర్దిష్ట సంఘటన ప్రత్యక్షంగా చిత్రీకరించిన ఫుటేజీని తప్పనిసరిగా భద్రతా అధికారులకు సమర్పించాలని, భద్రతా కార్యకలాపాల కేంద్రం 911లోని భద్రతా సిబ్బందికి తెలియజేయాలన్నారు. అటువంటి డాక్యుమెంటేషన్ను సోషల్ మీడియా డొమైన్లో ఎప్పుడూ పోస్ట్ చేయరాదని లేదా ప్రచురించకూడదని స్పష్టం చేశారు. డాక్యుమెంటేషన్ అనేది ఫోటోగ్రఫీకి మాత్రమే పరిమితం కాదని, స్టోర్లు, మార్కెట్లు మరియు ఇతర చోట్ల ఏర్పాటు చేసిన భద్రతా నిఘా కెమెరాల రికార్డింగ్లను కూడా పబ్లిక్ డొమైన్ లలో ప్రచురించడాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







