ప్రపంచ శాంతికి BAPS హిందూ మందిర్లో విశ్వ సంవాదిత యజ్ఞం
- February 12, 2024
అబుధాబి: ఫిబ్రవరి 11న అబుదాబిలోని BAPS హిందూ మందిర్లో విశ్వ సంవాదిత యజ్ఞం (ప్రపంచ సామరస్యం కోసం వేద ప్రార్థనలు) నిర్వహించారు.ఈ ప్రత్యేక ప్రార్థనలను ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ పేరిట అబుదాబిలో BAPS హిందూ మందిర్ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సు, విజయం సాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లండన్ కు చెందిన 70 ఏళ్ల భక్తురాలు జయశ్రీ ఇనామ్దార్ మాట్లాడుతూ.. వర్షాలు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మరింత చిరస్మరణీయంగా.. ఆనందదాయకంగా మార్చాయన్నారు. వర్షంలో యజ్ఞం జరగడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !