షేక్ జాయెద్ రోడ్డులో నిలిచిన వరద..!
- February 13, 2024
దుబాయ్: ఫిబ్రవరి 12 సాయంత్రం మరియు రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్లో వరద పోటెత్తింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అనేక కీలక రహదారుల్లో వాహనాలను మళ్లించారు. జెబెల్ అలీ ప్రాంతంలోని షేక్ జాయెద్ రోడ్డుపై కూడా వరద నీరు నిల్వడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని రోడ్డు మరియు రవాణా అథారిటీ (RTA) కోరింది. అబుదాబి వైపు వెళ్లే వారి కోసం షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్.. అబుదాబి నుండి వచ్చే వారి కోసం షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వైపు సీహ్ షుయబ్ స్ట్రీట్ ద్వారా వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుబాయ్ నుండి అబుదాబికి తిరిగి వెళ్తున్న నివాసితులు షేక్ జాయెద్ రోడ్లో వరద నిలవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాహనదారులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. మరోవైపు దేశంలో వర్షాలు కురుస్తున్నందున ఫిబ్రవరి 13న ఫ్లెక్సిబుల్ వర్క్ను కొనసాగించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







