షేక్ జాయెద్ రోడ్డులో నిలిచిన వరద..!
- February 13, 2024
దుబాయ్: ఫిబ్రవరి 12 సాయంత్రం మరియు రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్లో వరద పోటెత్తింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అనేక కీలక రహదారుల్లో వాహనాలను మళ్లించారు. జెబెల్ అలీ ప్రాంతంలోని షేక్ జాయెద్ రోడ్డుపై కూడా వరద నీరు నిల్వడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని రోడ్డు మరియు రవాణా అథారిటీ (RTA) కోరింది. అబుదాబి వైపు వెళ్లే వారి కోసం షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్.. అబుదాబి నుండి వచ్చే వారి కోసం షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వైపు సీహ్ షుయబ్ స్ట్రీట్ ద్వారా వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుబాయ్ నుండి అబుదాబికి తిరిగి వెళ్తున్న నివాసితులు షేక్ జాయెద్ రోడ్లో వరద నిలవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాహనదారులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. మరోవైపు దేశంలో వర్షాలు కురుస్తున్నందున ఫిబ్రవరి 13న ఫ్లెక్సిబుల్ వర్క్ను కొనసాగించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









