షేక్ జాయెద్ రోడ్డులో నిలిచిన వరద..!
- February 13, 2024
దుబాయ్: ఫిబ్రవరి 12 సాయంత్రం మరియు రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్లో వరద పోటెత్తింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అనేక కీలక రహదారుల్లో వాహనాలను మళ్లించారు. జెబెల్ అలీ ప్రాంతంలోని షేక్ జాయెద్ రోడ్డుపై కూడా వరద నీరు నిల్వడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని రోడ్డు మరియు రవాణా అథారిటీ (RTA) కోరింది. అబుదాబి వైపు వెళ్లే వారి కోసం షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్.. అబుదాబి నుండి వచ్చే వారి కోసం షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వైపు సీహ్ షుయబ్ స్ట్రీట్ ద్వారా వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుబాయ్ నుండి అబుదాబికి తిరిగి వెళ్తున్న నివాసితులు షేక్ జాయెద్ రోడ్లో వరద నిలవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాహనదారులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. మరోవైపు దేశంలో వర్షాలు కురుస్తున్నందున ఫిబ్రవరి 13న ఫ్లెక్సిబుల్ వర్క్ను కొనసాగించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







