మైత్రీ మూవీస్ ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- February 15, 2024టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ సంస్థ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా పేరు ‘8 వసంతాలు’. బ్యూటిఫుల్ పోస్టర్తో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి అంతకన్నా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్ని బట్టి ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగే ఓ కథ.. ఓ అందమైన యువతి తన జీవితంలోని అనేక ఒడిదుడుకుల్ని, ఎదుర్కొన్న అనుభవాల్నీ ఓ అందమైన జర్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
‘365 రోజుల్ని అంకెలతో కొలిస్తే సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే అదే వసంతం..’ అని పోస్టర్పై రాసుంది. అంటే, ఎనిమిది సంవత్సరాల అనుభవాల్ని బ్యూటిఫుల్గా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు మైత్రీ సంస్థ ఈ పోస్టర్ ద్వారా ఇన్నోవేటివ్గా తెలిపిందన్న మాట.
ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాని ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటించబోయే ఆ అందమైన యువతి ఎవరో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్