మైత్రీ మూవీస్ ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- February 15, 2024
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ సంస్థ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా పేరు ‘8 వసంతాలు’. బ్యూటిఫుల్ పోస్టర్తో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి అంతకన్నా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్ని బట్టి ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగే ఓ కథ.. ఓ అందమైన యువతి తన జీవితంలోని అనేక ఒడిదుడుకుల్ని, ఎదుర్కొన్న అనుభవాల్నీ ఓ అందమైన జర్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
‘365 రోజుల్ని అంకెలతో కొలిస్తే సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే అదే వసంతం..’ అని పోస్టర్పై రాసుంది. అంటే, ఎనిమిది సంవత్సరాల అనుభవాల్ని బ్యూటిఫుల్గా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు మైత్రీ సంస్థ ఈ పోస్టర్ ద్వారా ఇన్నోవేటివ్గా తెలిపిందన్న మాట.
ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాని ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటించబోయే ఆ అందమైన యువతి ఎవరో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









