మైత్రీ మూవీస్ ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- February 15, 2024
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ సంస్థ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా పేరు ‘8 వసంతాలు’. బ్యూటిఫుల్ పోస్టర్తో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి అంతకన్నా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్ని బట్టి ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగే ఓ కథ.. ఓ అందమైన యువతి తన జీవితంలోని అనేక ఒడిదుడుకుల్ని, ఎదుర్కొన్న అనుభవాల్నీ ఓ అందమైన జర్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
‘365 రోజుల్ని అంకెలతో కొలిస్తే సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే అదే వసంతం..’ అని పోస్టర్పై రాసుంది. అంటే, ఎనిమిది సంవత్సరాల అనుభవాల్ని బ్యూటిఫుల్గా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు మైత్రీ సంస్థ ఈ పోస్టర్ ద్వారా ఇన్నోవేటివ్గా తెలిపిందన్న మాట.
ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాని ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటించబోయే ఆ అందమైన యువతి ఎవరో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







