మాల్దీవుల నుంచి బహిష్కరణకు గురైన 43 మంది భారతీయులు
- February 15, 2024
మాలే: వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది. దేశంలో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలలో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీయులను వెనక్కి పంపగా.. అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
వీసా మానిప్యులేషన్, గడువు తీరినా అక్రమంగా దేశంలోనే ఉండడం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వారి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు ఎనిమిది మంది నేపాలీయులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు









