ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..11 మంది మృతి
- February 16, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని అలీపూర్ లోని పెయింట్స్, కెమికల్ గోడౌన్ లలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే 22 ఫైరింజన్లు సంఘటనా స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అర్థరాత్రి తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పలు నివాసాల గోడలు కూడా దెబ్బతిన్నాయి. మృతుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని పరిస్థితులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను మార్చరీకి తరలించారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్ల మార్గం నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న కార్మికులు తప్పించుకోలేక పోయినట్లు స్థానిక అధికారి తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మంటల వ్యాప్తికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అతుల్ గార్డ్ వివరాలప్రకారం.. మరో ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సుమిత్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు శబ్దం విని అందరూ ఇక్కడకు చేరుకున్నామని, మేము మమంటలను ఆర్పడానికి ప్రయత్నించే సమయంలో తొలుత 7నుంచి 8 అగ్నిప్రమాక యంత్రాలు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే చర్యలు ప్రారంభించాయని, అయిన మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆ తరువాత మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయని చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







