ఇంకా వరదల్లోనే దుకాణాలు, కార్లు!
- February 16, 2024
యూఏఈ: దేశంలోని తూర్పు తీరాన్ని తాకిన కుండపోత వర్షాలతో కల్బాలోని వివిధ ప్రాంతాలలో వరద పోటెత్తింది. మూడు రోజులు గడిచినా దుకాణాలు, కార్లు వరదల్లోనే ఉన్నాయి. కల్బాలోని అల్ కెరామ్ బేకరీలో తాండూర్ రోటీ మేకర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దుకాణం వరదలోనే ఉందని, మరో నెల రోజుల వరకు వరదనీరు నిలిచే అవకాశం ఉందన్నారు. చిన్న వ్యాపారాలతో, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్ వర్క్లు, ఫర్నిచర్ మరియు ఆటోమొబైల్ గ్యారేజీలు వంటి అనేక మధ్య తరహా వ్యాపారాలు మిలియన్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. కల్బాలోని పారిశ్రామిక జిల్లాలోని చిన్న తరహా కర్మాగారాలు, గిడ్డంగులు వరదల్లోన ఉన్నాయని అల్ ఫెసౌల్ మెటాలిక్ డోర్స్ అండ్ విండోస్ మేనేజర్ నబిల్ మహ్మద్ తెలిపారు. తమ వర్క్షాప్ మరియు ప్రొడక్షన్ యూనిట్ 3 అడుగుల వరకు నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ఖరీదైన యంత్రాల పరంగా తాము గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరోవైపు వరదలో మునిగిన వాహనాలను వెలికితీసేందుకు టోయింగ్ మరియు రికవరీ వాహనాలు 24 గంటలు పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







