ఇంకా వరదల్లోనే దుకాణాలు, కార్లు!
- February 16, 2024
యూఏఈ: దేశంలోని తూర్పు తీరాన్ని తాకిన కుండపోత వర్షాలతో కల్బాలోని వివిధ ప్రాంతాలలో వరద పోటెత్తింది. మూడు రోజులు గడిచినా దుకాణాలు, కార్లు వరదల్లోనే ఉన్నాయి. కల్బాలోని అల్ కెరామ్ బేకరీలో తాండూర్ రోటీ మేకర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దుకాణం వరదలోనే ఉందని, మరో నెల రోజుల వరకు వరదనీరు నిలిచే అవకాశం ఉందన్నారు. చిన్న వ్యాపారాలతో, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్ వర్క్లు, ఫర్నిచర్ మరియు ఆటోమొబైల్ గ్యారేజీలు వంటి అనేక మధ్య తరహా వ్యాపారాలు మిలియన్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. కల్బాలోని పారిశ్రామిక జిల్లాలోని చిన్న తరహా కర్మాగారాలు, గిడ్డంగులు వరదల్లోన ఉన్నాయని అల్ ఫెసౌల్ మెటాలిక్ డోర్స్ అండ్ విండోస్ మేనేజర్ నబిల్ మహ్మద్ తెలిపారు. తమ వర్క్షాప్ మరియు ప్రొడక్షన్ యూనిట్ 3 అడుగుల వరకు నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ఖరీదైన యంత్రాల పరంగా తాము గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరోవైపు వరదలో మునిగిన వాహనాలను వెలికితీసేందుకు టోయింగ్ మరియు రికవరీ వాహనాలు 24 గంటలు పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







