నిర్మాణ సామగ్రి ధరలు పెంచితే..1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా
- February 20, 2024
యూఏఈ: భారీ వాహనాల బరువులు మరియు పరిమాణాల నిర్ణయాన్ని వాయిదా వేయాలని యూఏఈ క్యాబినెట్ ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిర్మాణ సామగ్రి మునుపటి ధరలకు తగ్గించాలని కంపెనీలకు పిలుపునిచ్చింది. ధరల పెరుగుదలను నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లంఘించిన కంపెనీలపై 1 మిలియన్ దిర్హామ్ల వరకు ఆర్థిక జరిమానాలు విధించడంతోపాటు, ఎలాంటి అన్యాయమైన ధరల పెరుగుదలను నివారించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో అమల్లోకి వచ్చిన క్యాబినెట్ నిర్ణయం కారణంగా స్థానిక మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరలు ఇటీవల పెరగడాన్ని మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ముందస్తు అనుమతి లేకుండా నిర్మాణ సామగ్రి ధరలను పెంచే ఏవైనా కంపెనీలు జరిమానాలను ఎదుర్కొంటాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ ధరల పెంపుదల గురించి 8001222కి కాల్ చేయడం ద్వారా లేదా [email protected]కి ఇమెయిల్ చేయడం ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







