చెక్-ఇన్ బ్యాగేజీపై ఎయిర్ ఇండియా తగ్గింపు ఆఫర్..!
- February 21, 2024
యూఏఈ: చెక్-ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించే వారికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలను ప్రకటించింది. యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రయాణించే ప్రయాణీకులు తక్కువ విమాన ఛార్జీల నుండి ప్రయోజనం పొందవచ్చు. బ్యాగేజ్ బెల్ట్ల వద్ద క్యూలను నివారించడానికి వీలు కల్పిస్తుందని.. ముందుగా బుక్ చేసిన +15 మరియు +20 లకు అదనంగా కాంప్లిమెంటరీ కింద +3 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అలవెన్స్ ప్రకటించారు. ఈ కొత్త ప్యాకేజీ భారతదేశం-యూఏఈ మార్గాలకు కూడా వర్తిస్తుంది. ఇండియా బడ్జెట్ క్యారియర్ భారతదేశం మరియు యూఏఈ మధ్య వారానికి 195 విమానాలను నడుపుతోంది. ఇందులో దుబాయ్కి 80, షార్జాకు 77, అబుదాబికి 31, రస్ అల్ ఖైమాకు 5 మరియు అల్ ఐన్కి 2 ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతానికి, ఇది వారానికి 308 విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. క్యారియర్ యూఏఈ సహా గల్ఫ్ ప్రాంతానికి సామర్థ్యాన్ని పెంచుతుందని, అలాగే భారతదేశం అంతటా వివిధ టైర్ 2 మరియు 3 నగరాల్లోని గల్ఫ్ ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించాలని చూస్తున్నట్లు చెప్పారు. 7 కిలోల స్టాండర్డ్ క్యాబిన్ బ్యాగేజ్ అలవెన్స్తో పాటు ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణీకులు బుకింగ్ సమయంలో లేదా ఆ తర్వాత ఎయిర్లైన్లోని 'మేనేజ్' లేదా 'చెక్-ఇన్' విభాగాలలో అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ప్రీ-బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లో సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణీకులకు చెక్-ఇన్ బ్యాగేజీ సేవలు 15kg మరియు 20kg అదనపు సామాను స్లాబ్ల కోసం భారీ తగ్గింపు ధరల వద్ద అదనపు 'చెక్-ఇన్ బ్యాగేజీ' అలవెన్సులను కూడా సౌకర్యవంతంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ అన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









