కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

- February 21, 2024 , by Maagulf
కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

అమరావతి: చదువుతోనే పేద కుటుంబాల తలరాతలు మారుతాయని.. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే వైస్సార్ కళ్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా సాయం విడుదల చేస్తున్నామని, నేడు ఐదో విడతగా 10,132 జంటలకు మంచి జరిగిస్తూ రూ.78.53 కోట్లు అందిస్తున్నామని ముఖమంత్రి జగన్ అన్నారు. అక్టోబర్‌–డిసెంబర్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 10,132 జంటలకు రూ.78.53 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. అంతకుముందు వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలోని నిబంధనల వల్ల జరుగుతున్న మేలు, చదువుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఇస్తున్న ఫలితాల గురించి సీఎం జగన్‌ మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com